
హత్య కేసులో మరో ఆరుగురు అరెస్ట్
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని ఏఎస్ఆర్ కాలనీలో ఈ నెల 7న జరిగిన కనితి సతీష్ హత్య కేసులో మరో ఆరుగురు నిందితులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఏఎస్పీ విక్రాంత్ కుమా ర్ సింగ్ కథనం ప్రకారం.. ఏఎస్ఆర్ కాలనీలో జరి గిన హత్య కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు గంజి సాయి సహా 12మంది నిందితులను అరెస్ట్ చేశా రు. పరారీలో ఉన్న సారపాకకు చెందిన వల్లెపు నా ని, భద్రాచలానికి చెందిన పగిడిపాటి మురళీకృష్ణ, షేక్ షరీఫ్, కొండవీటి పవన్కళ్యాణ్, ఎటపాక మండలంలోని శ్రీరంనగర్కాలనీకి చెందిన దామెర్ల రమేష్తోపాటు మరొకరిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఇంకా పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
పరిశ్రమల ఏర్పాటుపై
మహిళలకు అవగాహన
ఖమ్మంమయూరిసెంటర్: గ్రామీణ ప్రాంత స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలతో పరిశ్రమలు ఏర్పాటు చేయించేలా అవగాహన కల్పిస్తున్నట్లు డీఆర్డీఏ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం జెడ్పీ కార్యాలయంలో డీఆర్డీఏ, సెర్ప్ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో అడిషనల్డీఆర్డీఓ ఆర్.జయశ్రీ మాట్లాడారు. మహి ళలు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు సదస్సుల్లో ఔత్సాహికుల ను ఎంపిక చేసి పరిశ్రమల ఏర్పాటు, నిర్వహ ణ, మెళకువలు, నైపుణ్యాభివృద్ధిపై 15 రోజుల శిక్ష ణ ఇస్తామని, అంతేకాక లైసెన్స్, రుణాల మంజూరులో అండగా నిలుస్తామని తెలిపారు.