అర్చక, ఉద్యోగులకు | - | Sakshi
Sakshi News home page

అర్చక, ఉద్యోగులకు

Jun 17 2025 5:15 AM | Updated on Jun 17 2025 5:15 AM

అర్చక

అర్చక, ఉద్యోగులకు

● కేటగిరీల వారీగా ఆర్థిక ప్రయోజనాలు ● సేవల ఆధారంగా లబ్ధి చేకూర్చేలా నిర్ణయం ● జాబితాలో ధూప, దీప పథకం అర్చకులు కూడా..

ఖమ్మంగాంధీచౌక్‌: ఆలయాల్లో పనిచేసే అర్చక, ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించింది. శాశ్వత అర్చక, ఉద్యోగులతో పాటు ధూప, దీప నివేదన(డీడీఎన్‌) పథకం అమలవుతున్న ఆలయాల అర్చకులకు ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టింది. ఈమేరకు సంక్షేమ నిధి ద్వారా అర్చక, ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు, సామాజిక భద్రత కల్పించే లక్ష్యంగా విధివిధానాలను ప్రకటించింది. అంతేకాక పదవీ విరమణ పొందిన తర్వాత అందే ప్రయోజనాలను సైతం పెంచడం విశేషం. అయితే, ఈ ప్రయోజనాలు అర్చక, ఉద్యోగుల సేవా కాలం ఆధారంగా అందుతాయి. ప్రభుత్వ నిర్ణయంతో మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, వివాహ పథకం, ఉపనయనం, ఇంటి నిర్మాణం, మరమ్మతులు, విద్య తదితర అంశాల్లో లబ్ధి జరగనుంది.

సంక్షేమ ట్రస్టు ద్వారా ప్రయోజనాలు

రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆలయ అర్చక, ఉద్యోగుల ప్రయోజనాల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది. ఈ ట్రస్టు ద్వారా పది రకాల పథకాలు అమలుకానున్నాయి.

●అర్చక, ఉద్యోగులకు రిటైర్‌మెంట్‌ గ్రాట్యూటీ(మరణానంతరం) 20ఏళ్లకు పైగా సేవలందించి వారైతే రూ.8 లక్షలు, 15–20 ఏళ్ల సర్వీస్‌ కలిగిన వారికి రూ.6 లక్షలు, 10–15 ఏళ్ల సర్వీస్‌ ఉంటే రూ.4 లక్షలు, పదేళ్ల కనీస సర్వీస్‌ పూర్తికాక ముందే మృతి చెందితే రూ.2 లక్షలు చెల్లిస్తారు. అలాగే, ధూప, దీప నివేదన పథకం అర్చకులకు మరణానంతరం గ్రాట్యూటీ రూపంలో సర్వీస్‌ ఆధారంగా రూ.4లక్షలు, రూ.3లక్షలు, రూ.2లక్షలు, రూ.లక్ష అందుతాయి.

●మెడికల్‌ రీయింబర్స్‌మెంటు గ్రాంట్‌ కింద మెడికల్‌ బోర్డు సిఫారసుతో గరిష్టంగా రూ.2 లక్షలు అందిస్తారు.

●వివాహ పథకం కింద రెగ్యులర్‌ ఉద్యోగులు, కన్సాలిడేటెడ్‌, ధూప, దీప నివేదన అర్చకులకు రూ.1,01,116 అందిస్తారు. రెగ్యులర్‌ ఉద్యోగులకై తే రుణంగా రూ. 2 లక్షలు, మహిళా ఉద్యోగితో పాటు ఆమె కుమార్తె, సోదరి వివాహానికి రూ. 1,25,000 అందిస్తారు.

●ఉపనయనం గ్రాంట్‌ కింద రూ. 50 వేలు అందించనున్నారు.

●మరణానంతరం ఎక్స్‌గ్రేషియాగా రూ.50 వేలు, అంతిమ సంస్కారాల ఖర్చులకు రూ.30 వేలు అందిస్తారు.

●ఇంటి నిర్మాణానికి రూ.50 వేలు, రెగ్యులర్‌ ఉద్యోగులకై తే రూ.4 లక్షల మేర బ్యాంకు రుణంపై వడ్డీ మొత్తం ఐదేళ్ల వరకు చెల్లిస్తారు.

●విద్య పథకం ద్వారా గ్రాడ్యుయేషన్‌, పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు ఏటా రూ.35 వేలు రీయింబర్స్‌మెంట్‌ చేస్తారు.

●విధులు నిర్వర్తించలేదని దివ్యాంగులైన ఉద్యోగులకు ఆర్థిక సాయంగా కనీసం 5 – 10 ఏళ్ల సర్వీస్‌ పూర్తయితే రూ.లక్ష, పదేళ్లకు పైగాసర్వీస్‌ ఉంటే రూ. 2లక్షలు అందిస్తారు.

ఖమ్మంలోని భ్రమరాంబ సమేత గుంటు మల్లేశ్వరస్వామి దేవాలయం

ఉమ్మడి జిల్లాలో 702 మంది

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ ట్రస్టు ద్వారా ఉమ్మడి జిల్లాలోని ఆలయాల అర్చక, ఉద్యోగులు, దూప, ధీప నివేదన అర్చకులు కలిపి 702 మందికి ప్రయోజనం కలగనుంది. రెండు జిల్లాల్లోని 93 ఆలయాల్లో 100 అర్చకులు, పాచికలు, సహాయ అర్చకులు, పరిచారకులు పనిచేస్తుండగా, జూనియర్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, ఇతర ఉద్యోగులు కలిపి 140 మంది ఉన్నారు. అలాగే, ధూప, దీప నివేదన పథకం ఆలయాల్లో 462 మంది అర్చకులు పనిచేస్తున్నారు.

ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం

ప్రభుత్వం అర్చకులు, ఉద్యోగుల ప్రయోజనాలకు సంక్షేమ నిధిలో ప్రాధాన్యత ఇచ్చింది. డీడీఎన్‌ అర్చకులకు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ప్రకటించడం సంతోషంగా ఉంది. అయితే, ఈ అర్చకులకు నెలనెలా వేతనాలు అందేలా చూడాలి. అంతేకాక మరిన్ని ఆలయాలకు పథకం అమలుచేస్తే అభివృద్ధితో పాటు మరికొందరు అర్చకులకు ఉపాధి లభిస్తుంది.

– మునగలేటి రమేష్‌శర్మ,

జిల్లా అధ్యక్షుడు, డీడీఎన్‌ అర్చకుల సంఘం

అర్చక, ఉద్యోగులకు 1
1/1

అర్చక, ఉద్యోగులకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement