
కుమారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్చిన ఉపాధ్యాయుడు
దుమ్ముగూడెం: మండలంలోని పర్ణశాల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఉబ్బా శివ తన ఇద్దరు కుమారులను ప్రభుత్వ ఎంపీపీఎస్ అంజిబాక పాఠశాలలో సోమవారం చేర్పించారు. ప్రాథమిక పాఠశాలల్లో జరుగుతున్న ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం, మంచి బోధన వల్లే తన కుమారులు హర్షవర్ధన్ 4వ తరగతి, ఖుషివర్ధన్ 2వ తరగతిలో చేర్పించానని ఉపాధ్యాయుడు తెలిపాడు. ఈ సందర్భంగా ఉబ్బా శివను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం పార్వతి, పర్ణశాల ఇన్చార్జ్ హెచ్ఎం ఏజే ప్రభాకర్, ఉపాధ్యాయురాలు లక్ష్మీరామం తదితరులు పాల్గొన్నారు.