విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Jun 17 2025 5:15 AM | Updated on Jun 17 2025 5:15 AM

విద్యుదాఘాతంతో  వ్యక్తి మృతి

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

టేకులపల్లి: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. టేకులపల్లి ఎస్‌ఐ రాజేందర్‌ కథనం ప్రకారం.. మండలంలోని దాసుతండా పంచాయతీ రేగులతండాకు చెందిన తేజావత్‌ కిషన్‌(52)రాత్రి స్నానం చేసేందుకు వెళ్ళి బాత్‌రూమ్‌లో ఉన్న ఇనుప తీగపై టవల్‌ వేశాడు. స్నానం చేశాక టవల్‌ తీసుకునే క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. సర్వీస్‌ వైర్‌ నుంచి బాత్‌రూమ్‌లోని ఇనుప తీగకు విద్యుత్‌ సరఫరా కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో విషయం బయటకు తెలియలేదు. సోమవారం ఉదయం కుమారుడు తండ్రి కోసం వెళ్లి చూసేసరికి బాత్‌రూమ్‌లో విగత జీవిగా పడి ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సందర్శించి సంతాపం తెలిపారు.

మద్యం తాగిన డ్రైవర్‌కు దేహశుద్ధి

మణుగూరు టౌన్‌: మున్సిపాలిటీలోని రాజుపేట గ్రామస్తులు మద్యం తాగి లారీ నడిపిన ఓ డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన సోమవారం జరిగింది. మున్సిపాలిటీలోని ఓ ఇసుక సొసైటీ వద్దకు లోడ్‌ కోసం రాజుపేట మీదుగా వెళ్తున్న లారీ రాజుపేట గ్రామం ప్రారంభంలో మలుపు వద్ద ఆటోను ఢీ కొట్టబోయింది. ఆటోలో ఇద్దరు చిన్నపిల్లలు, ముగ్గురు మహిళలు ఉండగా, త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఆగ్రహించిన రాజుపేట గ్రామస్తులు మద్యం తాగి లారీ నడుపుతున్న డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికులకు నచ్చజెప్పి పంపించేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement