
నేత్రపర్వంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి నిత్యకల్యాణ వేడుక ఆదివారం నేత్ర పర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. వేసవి సెలవుల చివరి ఆదివారం కావడంతో నిత్యకల్యాణ వేడుకలోనూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ కనకదుర్గ అమ్మవారికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం, పరిసరాల్లో సందడి నెలకొంది. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించగా, క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఈఓ ఎన్.రజనీకుమారి, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్శర్మ పాల్గొన్నారు.
లీగల్ సర్వీసెస్ అథారిటీ పరిశీలకుడిగా కృష్ణ
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ స్క్రూటినైజింగ్ సభ్యుడిగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాది యర్రపాటి కృష్ణను నియమిస్తూ చైర్మన్, జిల్లా జడ్జి వసంత్ పాటిల్ ఉత్తర్వులు జారీచేశారు. కృష్ణ నియామకంపై జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జనపరెడ్డి గోపికృష్ణ, కోశాధికారి కనకం చిన్నికృష్ణ, న్యాయవాదులు అభినందనలు తెలిపారు.

నేత్రపర్వంగా రామయ్య కల్యాణం

నేత్రపర్వంగా రామయ్య కల్యాణం