
రేషన్ బియ్యం పట్టివేత
మణుగూరుటౌన్: మున్సిపాలిటీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్బియ్యాన్ని మణుగూరు పోలీసులు ఆదివారం రాత్రి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మున్సిపాలిటిలోని ఆదర్శ్నగర్ ఏరియా నుంచి అక్రమంగా ఆటోలో తరలిస్తున్న సుమారు ఏడున్నర క్వింటాళ్ల రేషన్బియ్యాన్ని సీఐ నాగబాబు దాడి చేసి పట్టుకున్నారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఆటోను స్టేషన్కి తరలించి బియ్యం స్వాధీనం చేసుకున్నారు.
ముమ్మరంగా పోలీసుల తనిఖీలు
చర్ల: మండల కేంద్రమైన చర్లలో ఆదివారం జరిగిన వారపు సంతలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ జరిగే వారపు సంతకు సరిహద్దున ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి ఆదివాసీలు తరలివస్తుంటారు. వారి మాటున మావోయిస్టులు రావచ్చుననే అనుమానంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. లెనిన్కాలనీ, తాలిపేరు ప్రాజెక్టు, కలివేరు క్రాస్ రోడ్లలో తనిఖీలు చేపట్టారు.