
తండ్రికి కుమార్తె తలకొరివి
దమ్మపేట: తండ్రికి కుమార్తె తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని నాగుపల్లి గ్రామానికి చెందిన కునుసోతు రామకృష్ణకు మూడు రోజుల కిందట బ్రెయిన్ స్ట్రోక్ రాగా ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం పరిస్థితి విషమించి మృతిచెందాడు. మృతుడికి కుమారులు లేకపోవడంతో బీటెక్ చదువుతున్న ఆయన పెద్ద కుమార్తె శ్రావిక తలకొరివి పెట్టాల్సి వచ్చింది. ఫాదర్స్డే రోజే తండ్రికి కుమార్తె అంత్యక్రియలు చేయాల్సిరావడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
రోడ్డు ప్రమాదంలో వైద్యుడికి గాయాలు
టేకులపల్లి: రోడ్డు ప్రమాదంలో వైద్యుడికి గాయాలైన ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఇల్లెందు జగదాంబ సెంటర్కు చెందిన రమేశ్ సాహు కుమారుడు కార్తీక్ సాహు కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో వైద్యుడిగా చేస్తున్నాడు. ఆదివారం రాత్రి తన బైక్పై కొత్తగూడెం నుంచి ఇల్లెందుకు వెళ్తుండగా తొమ్మిదోమైలుతండా వద్ద ఎద్దు అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి కింద పడ్డాడు. గాయపడిన కార్తీక్ను కొత్తగూడెం ఆస్పత్రికి తీసుకెళ్లారు.
యువతి అదృశ్యం
దమ్మపేట: కళాశాలకు వెళ్లిన యువతి కనిపించకుండా పోయిన ఘటన మండలంలోని నాగుపల్లి గ్రామంలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని నాగుపల్లి గ్రామానికి చెందిన యువతి (20) సతుపల్లి మండలంలోని గంగారంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. ఈ నెల 2న కళాశాలకు వెళ్లిన యువతి.. ఇంటికి తిరిగిరాలేదు. ఆమె కుటుంబ సభ్యులు పలుచోట్ల ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో ఆదివారం యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు.
పోగొట్టుకున్న ఫోన్ అందజేత
భద్రాచలంటౌన్: భద్రాచలం బస్టాండ్లో పోగొట్టుకున్న ఫోన్ను తిరిగి బాధితురాలికి ఆదివారం డీఎం అప్పగించారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన పాఠకుల రిషిత.. తన ఫోన్ను భద్రాచలం డిపోకు చెందిన కొత్తగూడెం వెళ్లే బస్సులో పోగొట్టుకుంది. అదే బస్సులోని ప్ర యాణికులకు దొరకగా వారు ఫోన్ను భద్రాచ లం డీఎం అల్లం నాగేశ్వరరావుకు ఇచ్చారు. దీంతో ఆయన ఆ ఫోన్కి వచ్చిన ఫోన్ నంబర్ల ద్వా రా అది ఎవరి ఫోనో తెలుసుకొని, బాధితురాలు పాఠకుల రిషితకు ఫోన్ను అప్పగించారు.