ఏఐకేఎస్‌ జాతీయ కార్యవర్గంలో నలుగురికి స్థానం | - | Sakshi
Sakshi News home page

ఏఐకేఎస్‌ జాతీయ కార్యవర్గంలో నలుగురికి స్థానం

Apr 18 2025 12:15 AM | Updated on Apr 18 2025 12:15 AM

ఏఐకేఎ

ఏఐకేఎస్‌ జాతీయ కార్యవర్గంలో నలుగురికి స్థానం

ఖమ్మం మయూరిసెంటర్‌/పాల్వంచ/చింతకాని: అఖిల భారత కిసాన్‌ సభ(ఏఐకేఎంఎస్‌) జాతీయ సమితిలో ఉమ్మడి జిల్లా నుంచి నలుగురికి స్థానం లభించింది. తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నంలో గురువారం ముగిసిన జాతీయ మహాసభల్లో 36 మందితో జాతీయ కార్యవర్గం, 115 మందితో జాతీయ కౌన్సిల్‌ను ఎన్నుకున్నారు. ఈసందర్భంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన బాగం హేమంతరావు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అలాగే, భద్రాద్రి జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం, చింతకాని మండలం రాఘవాపురానికి చెందిన కొండపర్తి గోవిందరావుతో పాటు మందడపు రాణికి జాతీయ కౌన్సిల్‌లో సభ్యులుగా స్థానం దక్కింది. నేలకొండపల్లి మండలం ముటాపురానికి చెందని హేమంతరావు ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శిగా, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిగా, సీపీఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేయడంతో ప్రస్తుతం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కాగా, గోవిందరావు 1991లో సీపీఐలో కొనసాగుతుండగా వివిధ హోదాల్లో పనిచేయడమే కాక రాఘవాపురం సర్పంచ్‌గా ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఈమేరకు వీరిని పలువురు అభినందించారు

ఏఐకేఎస్‌ జాతీయ కార్యవర్గంలో నలుగురికి స్థానం1
1/2

ఏఐకేఎస్‌ జాతీయ కార్యవర్గంలో నలుగురికి స్థానం

ఏఐకేఎస్‌ జాతీయ కార్యవర్గంలో నలుగురికి స్థానం2
2/2

ఏఐకేఎస్‌ జాతీయ కార్యవర్గంలో నలుగురికి స్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement