నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

Apr 18 2025 12:13 AM | Updated on Apr 18 2025 12:13 AM

నేత్ర

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణం వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

పెద్దమ్మతల్లికి

సువర్ణ పుష్పార్చన

పాల్వంచరూరల్‌ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. అనంతరం నివేదన, హారతి సమర్పించాక మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్‌.రజనీకుమారి, వేద పడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు

పవర్‌ లిఫ్టింగ్‌లో బీటీపీఎస్‌ ఉద్యోగి ప్రతిభ

మణుగూరురూరల్‌ : ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో బీటీపీఎస్‌ ఉద్యోగి పి.రాజేష్‌ 110 కేజీల బెంచ్‌ ప్రెస్‌ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా ఆయనను బీటీపీఎస్‌ సీఈ బిచ్చన్న గురువారం అభినందించారు. అనంతరం సీఈ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలని, సంస్థకు పేరు ప్రఖ్యాతలు తేవాలని ఆకాంక్షించారు. క్రీడలు, క్రీడాకారులకు అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామన్నారు. కార్యక్రమంలో క్రీడా కార్యదర్శి కల్తీ నర్సింహరావు, డీఈ టెక్‌ సత్యనారాయణ, ఏడీఈ మూర్తి, సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు.

ఉద్యోగుల గైర్హాజరును నివారించాలి

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి ఉద్యోగులు, కార్మికుల గైర్హాజరు శాతాన్ని గణనీయంగా తగ్గించాలని పర్సనల్‌ జీఎం (ఐఆర్‌పీఎం అండ్‌ వెల్ఫేర్‌) కవితానాయుడు అన్నారు. కొత్తగూడెం రీజియన్‌ పరిధిలోని ఇల్లెందు, మణుగూరు, కొత్తగూడెం ఏరియాల పర్సనల్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులతో స్థానిక సింగరేణి ప్రధాన కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియాల వారీగా విధులకు గైర్హాజరవుతున్న వారిపై తీసుకోబోయే క్రమశిక్షణా చర్యలు, కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలు, కోర్టు కేసులు, ఉద్యోగుల పదోన్నతులు, కారుణ్య నియామకాలు, రిటైర్డ్‌ ఉద్యోగుల సీఎంపీఎఫ్‌, పెన్షన్‌, క్లెయిమ్‌, గ్రాట్యుటీ వంటి అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. అనంతరం కవితానాయుడు మాట్లాడుతూ.. తరచుగా గైర్హాజరయ్యే ఉద్యోగులకు వారి కుటుంబసభ్యులతో కౌన్సిలింగ్‌ నిర్వహించాలని సూచించారు. కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఫైళ్లు కూడా పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. సమావేశంలో డీజీఎంలు అజయ్‌కుమార్‌, రాజేంద్రప్రసాద్‌, ఎస్‌.రమేష్‌, ఎస్‌.వరప్రసాద్‌, వెంకటేశ్వరరావు, జి.వి. మోహన్‌రావు, వైవీఎల్‌ ప్రసాదరావు, రాజ్‌గోపాల్‌, ముకుంద సత్యనారాయణ, సీవీవీఎస్‌ మూర్తి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

నేత్రపర్వంగా  రామయ్య నిత్యకల్యాణం1
1/3

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

నేత్రపర్వంగా  రామయ్య నిత్యకల్యాణం2
2/3

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

నేత్రపర్వంగా  రామయ్య నిత్యకల్యాణం3
3/3

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement