శిబూసోరెన్ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి | YSRCP Chief YS Jagan Pays Ttibute To Shibu Soren | Sakshi
Sakshi News home page

శిబూసోరెన్ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Aug 4 2025 5:28 PM | Updated on Aug 4 2025 6:31 PM

YSRCP Chief YS Jagan Pays Ttibute To Shibu Soren

తాడేపల్లి :  జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ నేత శిబూ సోరెన్‌ మృతిపట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనియర్‌ నాయకుడైన శిబూ సోరెన్‌ మృతి దేశానికి తీరని లోటన్నారు వైఎస్‌ జగన్‌. 

గిరిజన సంక్షేమం కోసం శిబూ సోరెన్‌ చేసిన కృషి చిరస్మరణియమని కొనియాడారు. ఈ మేరకు శిబూ సోరెన్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానంటూ వైఎస్‌ జగన్‌ తన సోషల్‌ మీడియా హ్యాండిల్‌ ‘ఎక్స్‌’ ద్వారా ట్వీట్‌ చేశారు.

 జార్ఖండ్‌ మాజీ సీఎం శిబుసోరెన్‌ కన్నుమూత

డిషోమ్ గురు.. అందుకే ఆయన నవ్వడం మానేశారు!

 

Advertisement
 
Advertisement
Advertisement