
గుంటూరు, సాక్షి: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ ( Mark Shankar) సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ( YS Jaganmohan Reddy ) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
‘‘సింగపూర్ స్కూల్ ప్రమాదంలో పవన్ కల్యాణ్గారి తనయుడు మార్క్ శంకర్ గాయపడ్డాడని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా. ఈ క్లిష్ట పరిస్థితులలో ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.

సింగపూర్లో ఓ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంతో పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్కు చేతులు, కాళ్లకు గాయాలు అయినట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడే ఓ ప్రముఖ ఆసుపత్రిలో శంకర్ కు చికిత్స అందుతోందని, అతని ఆరోగ్యంపై ఆందోళన అక్కర్లేదని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది.
I am shocked to know about the fire accident at a school in Singapore in which @PawanKalyan garu's son, Mark Shankar got injured. My thoughts are with the family in this difficult time. Wishing him a swift and complete recovery.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 8, 2025