మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి: వైఎస్‌ జగన్‌ | YS Jagan wishes for speedy recovery of Pawan Son Mark Shankar | Sakshi
Sakshi News home page

మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి: వైఎస్‌ జగన్‌

Apr 8 2025 2:06 PM | Updated on Apr 8 2025 3:28 PM

YS Jagan wishes for speedy recovery of Pawan Son Mark Shankar

గుంటూరు, సాక్షి: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ ( Mark Shankar) సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి ( YS Jaganmohan Reddy ) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

‘‘సింగపూర్‌ స్కూల్‌ ప్రమాదంలో పవన్‌ కల్యాణ్‌గారి తనయుడు మార్క్‌ శంకర్‌ గాయపడ్డాడని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా. ఈ క్లిష్ట పరిస్థితులలో ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మార్క్‌ శంకర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని ఎక్స్‌ ఖాతాలో వైఎస్‌ జగన్‌ పోస్ట్‌ చేశారు. 

మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని YS జగన్ ట్వీట్

సింగపూర్‌లో ఓ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంతో పవన్‌ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్‌కు చేతులు, కాళ్లకు గాయాలు అయినట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడే ఓ ప్రముఖ ఆసుపత్రిలో శంకర్ కు చికిత్స అందుతోందని, అతని ఆరోగ్యంపై ఆందోళన అక్కర్లేదని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement