అచ్యుతాపురం సెజ్‌లో పేలుడు ఘటనపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి | YS Jagan Is Shocked At The Explosion Incident In Atchutapuram Sez, See Details Inside | Sakshi
Sakshi News home page

అచ్యుతాపురం సెజ్‌లో పేలుడు ఘటనపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Aug 21 2024 4:16 PM | Updated on Aug 21 2024 9:36 PM

Ys Jagan Is Shocked At The Explosion Incident In Atchutapuram Sez

అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో రియాక్టర్‌ పేలుడు ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సాక్షి, గుంటూరు: అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో రియాక్టర్‌ పేలుడు ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

‘‘అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలుడు కారణంగా పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్‌ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తున్నాను. గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలి. వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలి. మా పార్టీ నాయకులతో కూడిన బృందం అక్కడ పర్యటించి, బాధితులకు తోడుగా నిలుస్తుంది. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి. మళ్లీ ఇలాంటివి జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలి.’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

 

 

వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement