
సాక్షి, తాడేపల్లి: నేడు వాల్మీకి జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. వాల్మీకికి నివాళి అర్పించారు. ప్రపంచానికి రామాయణ ఇతిహాసాన్ని అందించిన మహర్షి వాల్మీకి అని ప్రశసించారు.
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వాల్మీకి జయంతి కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలో వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేసి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. అంతకుముందు ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్..‘ప్రపంచానికి రామాయణ ఇతిహాసాన్ని అందించిన మహర్షి వాల్మీకి, వేటగాడైన వాల్మీకి రామనామాన్ని జపిస్తూ మహర్షిగా మారిన తీరు అందరికీ ఆదర్శనీయం. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు’ అని పోస్టు పెట్టారు.
ప్రపంచానికి రామాయణ ఇతిహాసాన్ని అందించిన మహర్షి వాల్మీకి, వేటగాడైన వాల్మీకి రామనామాన్ని జపిస్తూ మహర్షిగా మారిన తీరు అందరికీ ఆదర్శనీయం. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. pic.twitter.com/vOuTOBRGod
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 7, 2025
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషా శ్రీచరణ్, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ధర్మాన కృష్ణదాస్, పార్టీ సీనియర్ నేతలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, దూలం నాగేశ్వరరావు, బి.వై.రామయ్య తదితరులు పాల్గొన్నారు.

07.10.2025
తాడేపల్లి
మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషా శ్రీచరణ్,… pic.twitter.com/GcSwK3UqYN— YSR Congress Party (@YSRCParty) October 7, 2025