సీఎం జగన్‌కు యడవల్లి దళిత రైతులు సత్కారం | Yadavalli Farmers Honoring CM YS Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌కు యడవల్లి దళిత రైతులు సత్కారం

Nov 23 2021 7:52 AM | Updated on Nov 23 2021 7:52 AM

Yadavalli Farmers Honoring CM YS Jagan - Sakshi

టీడీపీ హయాంలో ఎడతెగని పోరాటం చేసిన తమకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ న్యాయం చేశారని గుంటూరు జిల్లా యడవల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు పేర్కొన్నారు. తమ భూములకు ప్రభుత్వం తరపున రూ.30 కోట్ల పరిహారం చెల్లించడం ద్వారా.. ఇచ్చిన మాటను సీఎం జగన్‌ నిలబెట్టుకున్నారని తెలిపారు.

సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో ఎడతెగని పోరాటం చేసిన తమకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ న్యాయం చేశారని గుంటూరు జిల్లా యడవల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు పేర్కొన్నారు. తమ భూములకు ప్రభుత్వం తరపున రూ.30 కోట్ల పరిహారం చెల్లించడం ద్వారా.. ఇచ్చిన మాటను సీఎం జగన్‌ నిలబెట్టుకున్నారని తెలిపారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ఆధ్వర్యంలో యడవల్లి దళిత రైతులు సోమవారం శాసనసభలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారంగా ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం జగన్‌ను సత్కరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement