ప్రధాన రహదారిపై నాట్లు | Women protest in Kakinada district | Sakshi
Sakshi News home page

ప్రధాన రహదారిపై నాట్లు

Jul 1 2025 3:10 AM | Updated on Jul 1 2025 3:10 AM

Women protest in Kakinada district

రమణయ్యపేట వద్ద ప్రధాన రహదారిపై నాట్లు వేస్తున్న మహిళలు

కాకినాడ జిల్లాలో మహిళల వినూత్న నిరసన

ఏలేశ్వరం: ప్రధాన రహదారిని పునర్నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ, భారీ గోతులు పడిన ఈ రోడ్డుపై మహిళలు నాట్లు వేసిన ఘటన ఇది. కాకినాడ జిల్లా ఏలేశ్వరం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీకి వెళ్లే ప్రధాన రహదారి శిథిలమై దారుణంగా ఉంది. రమణయ్యపేట గ్రామం నుంచి పది కిలోమీటర్ల మేర ఈ రోడ్డు గోతులమయంగా మారింది.  కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ రోడ్డు మరింత అధ్వానంగా మారింది. 

రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఈ నేపథ్యంలో సీపీఐ (ఎంఎల్‌) వినోద్‌మిశ్రా, సీపీఎం అనుబంధ ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యాన మహిళలు ప్రధాన రహదారిపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. రహదారిని పునర్నిర్మించేంత వరకూ కదిలేదిలేదని భీషి్మంచారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కూటమి  ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని మహిళలు, నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘాల నాయకులు లోత రామారావు, రెడ్డి ఆనంద్‌­పాల్, గండేటి నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement