
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,అమరావతి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న జగనన్న ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ప్రభుత్వ విప్ల సమావేశం నిర్ణయించింది. చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి 40 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇళ్ల నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లను, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నిర్మాణానికి సంబంధించి ఇసుక, కంకరకు కొరత లేకుండా ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కృషి చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చారు.
ఈ బృహత్తర కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఎమ్మెల్యే నిరంతరం కృషి చేసేందుకే సమావేశం జరిగిందని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.