Whip Meeting MLAs Special Focus On Jagananna Illa Nirmanam- Sakshi
Sakshi News home page

జగనన్న ఇళ్ల నిర్మాణంపై ఎమ్మెల్యేల ప్రత్యేక దృష్టి

Jul 30 2021 8:50 AM | Updated on Jul 30 2021 12:27 PM

Whip Meeting MLAs Special Focus On Jagananna Illa Nirmanam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,అమరావతి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న జగనన్న ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ప్రభుత్వ విప్‌ల సమావేశం నిర్ణయించింది. చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి 40 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇళ్ల నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లను, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నిర్మాణానికి సంబంధించి ఇసుక, కంకరకు కొరత లేకుండా ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కృషి చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చారు.

ఈ బృహత్తర కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఎమ్మెల్యే నిరంతరం కృషి చేసేందుకే సమావేశం జరిగిందని శ్రీకాంత్‌ రెడ్డి చెప్పారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement