టీడీపీలో ఆధిపత్య పోరు.. ఇద్దరు నేతల దారుణ హత్య | Two Tdp Leaders Assassination In Palnadu District | Sakshi
Sakshi News home page

టీడీపీలో ఆధిపత్య పోరు.. ఇద్దరు నేతల దారుణ హత్య

May 24 2025 7:24 PM | Updated on May 24 2025 7:55 PM

Two Tdp Leaders Assassination In Palnadu District

పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో డబుల్‌ మర్డర్‌ కలకలం రేపింది. ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్యకు గురయ్యారు. గుండ్లపాడు టీడీపీలో ఆధిపత్య పోరు కారణంగా ఇద్దరు బలయ్యారు. బైక్‌పై వెళ్తున్న టీడీపీ నేతలు ముద్దయ్య, ఆయన సోదరుడు కోటేశ్వరరావును ఆ పార్టీకే చెందిన మరో వర్గం స్కార్పియో ఢీకొట్టి చంపేసింది. వెల్దుర్తి మండలం బోదలవీడులో ఈ ఘటన జరిగింది.

గత కొంతకాలంగా గ్రామంలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎలాంటి గొడవలు జరగకుండా గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement