వైఎస్‌ జగన్‌ను కలిసిన తమిళనాడు మంత్రి ఈవీ వేలు | Tamil Nadu Minister Ev Velu And MP Wilson Meet YS Jagan To Invite For All-Party Meeting In Chennai | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన తమిళనాడు మంత్రి ఈవీ వేలు

Mar 12 2025 8:30 PM | Updated on Mar 13 2025 8:45 AM

Tamil Nadu Minister Ev Velu And Mp Wilson Meet Ys Jagan

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తమిళనాడు మంత్రి ఈవీ వేలు, ఎంపీ విల్సన్‌ బుధవారం కలిశారు.

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తమిళనాడు మంత్రి ఈవీ వేలు, ఎంపీ విల్సన్‌ బుధవారం కలిశారు. ఈ నెల 22న చెన్నైలో జరగనున్న దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి వైఎస్‌ జగన్‌ను ఆహ్వానించారు. తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్‌ రాసిన లేఖను వైఎస్‌ జగన్‌కు డీఎంకే నేతలు అందజేశారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీ అధినేతలకు సీఎం స్టాలిన్‌ ఆహ్వానం పంపించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement