దళిత సర్పంచ్‌పై అధికార జులుం | Sarpanch complained that a TDP party member had encroached upon government land and his own land | Sakshi
Sakshi News home page

దళిత సర్పంచ్‌పై అధికార జులుం

Dec 20 2025 4:48 AM | Updated on Dec 20 2025 4:48 AM

Sarpanch complained that a TDP party member had encroached upon government land and his own land

ప్రభుత్వస్థలం, తన స్థలం టీడీపీ వర్గీయుడు కబ్జాచేశారని సర్పంచ్‌ ఫిర్యాదు 

అది ఆక్రమణే అని తేల్చిన రెవెన్యూ అధికారులు

దీంతో కబ్జాచేసి కట్టిన గోడను కూల్చేసిన సర్పంచ్‌  

ఇందుకుగాను సర్పంచ్‌పై కేసు నమోదు  

బలవంతంగా స్టేషన్‌కు తీసుకెళ్లిన సీఐ

సాక్షి టాస్క్ ఫోర్స్‌: తన స్థలంతోపాటు రైతుసేవా కేంద్రం దారిని ఆక్రమంచి టీడీపీ సానుభూతిపరుడు నిర్మించిన ప్రహరీని కూల్చేసిన ఎస్సీ వర్గీయుడైన సర్పంచ్‌పై కేసుపెట్టి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లిన వైనమిది. బాపట్ల జిల్లా అద్దంకి మండలం చక్రాయపాలెంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన అధికారపార్టీ నేతలు, అధికారుల వైఖరికి అద్దం పడుతోంది. బాధిత సర్పంచ్‌ నగేశ్‌ తెలిపిన మేరకు.. వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రభుత్వస్థలంలో రైతుభరోసా కేంద్రం నిరి్మంచారు. దానికి దారికోసం సర్పంచ్‌ నగేశ్‌ సర్వేనంబరు 127/7 లోని తన స్థలంలో ఐదడుగులు ఇచ్చారు. 

ఆ పక్కనే నివాసం ఉంటున్న టీడీపీ సానుభూతిపరులు టి.వెంకాయమ్మ, శ్రీనివాసరావు దంపతు­లు ఇటీవల రైతుసేవా కేంద్రానికి వెళ్లే రహదారిలో కొంత, నగేశ్‌ పట్టాభూమిలో కొంత ఆక్రమించి ప్రహరీ కట్టేందుకు పిల్లర్లు వేశారు. దీంతో సర్పంచ్‌ ఆ స్థలాన్ని సర్వేచేయాలంటూ తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. తహసీల్దార్‌ ఆదేశాలతో సర్వేయర్‌ వచ్చి స్థలాన్ని సర్వేచేసి టీడీపీ సానుభూతిపరుడు గోడకట్టే ప్రదేశంలో ఆక్రమణ ఉందని నివేదిక ఇచ్చారు. 

ఈ విషయం చెప్పి సర్పంచ్‌ హెచ్చరించినా వినకుండా వారు గోడకట్టారు. సర్పంచ్‌పై దాడిచేసి కులం పేరుతో దూషించారు. ఆ విషయమై సర్పంచ్‌ రెండురోజుల కిందట ఎస్పీకి, జేసీకి ఫిర్యాదు చేశారు. ఎవరూ స్పందించకపోవడంతో సర్పంచ్‌ నగేశ్‌ ఆ అక్రమ గోడను యంత్రంతో కూల్చేశారు. దీంతో తన గోడను సర్పంచ్‌ కూల్చేశారని శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుడి ప్రోద్బలంతో శుక్రవారం నగేశ్‌ స్థలంలో నుంచి విద్యుత్‌ సిబ్బంది కరెంటు స్తంభాలు వేయసాగారు. వారిని నగేశ్‌ అడ్డుకున్నారు. వారి సమాచారంతో గ్రామానికి వెళ్లిన సీఐ సుబ్బరాజు గోడ కూల్చినందుకు తీసుకెళ్తున్నానంటూ సర్పంచ్‌ నగేశ్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

ఈ విషయమై సీఐ సుబ్బరాజును అడగగా.. ఆక్రమణ విషయమై కోర్టులో తేల్చుకోవాల­ని, పడేయడం క్రిమినల్‌ కేసు అవుతుందని చె­ప్పా­రు. అందుకే తీసుకొచ్చి 41 నోటీసు ఇచ్చి పంపినట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాన్ని కబ్జాచేసి గోడ నిరి్మంచినా పట్టించుకోని అధికారులు.. ఆ గోడ తొలగించారని సర్పంచ్‌పైనే కేసు పెట్ట­డం ఏమిటని స్థానికులు చర్చించుకుంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement