బలహీనపడిన వాయుగుండం | Rain likely at many places in South Coastal Andhra today | Sakshi
Sakshi News home page

బలహీనపడిన వాయుగుండం

Dec 23 2024 4:04 AM | Updated on Dec 23 2024 4:04 AM

Rain likely at many places in South Coastal Andhra today

దక్షిణ ఏపీ వైపు కదిలి మరింత బలహీనపడే అవకాశం 

నేడు దక్షిణ కోస్తాంధ్రలో పలు చోట్ల వర్షాలకు ఆస్కారం 

పల్నాడు జిల్లాలో కుండపోత 

నీట మునిగిన పంటలు.. తడిచిపోయిన ధాన్యం 

తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు

సాక్షి, విశాఖపట్నం/బొల్లాపల్లి: వాయుగుండం బల­హీ­నపడి.. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా కొ­న­సాగుతోంది. ఇది పశ్చిమ–నైరుతి దిశగా కదులుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ వైపుగా వచ్చి అల్పపీడనంగా బలహీ­నపడనుంది. 

మంగళవారం నాటికి దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాల వైపు ప్రయా­ణిస్తూ నైరు­తి బంగాళాఖాతం వద్ద మరింత బల­హీన­పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో నేడు, రేపు అక్కడ­క్కడా వానలు, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నా­యని వాతావ­రణ శాఖ తెలిపింది. 

గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తా­యని..ఈ నేపథ్యంలో 25 వరకు దక్షిణ కోస్తా తీరం వైపు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

అకాల వర్షం ముంచేసింది..
పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో శనివా­­రం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారు­జాము వరకు 4 గంటల­పాటు భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు పొ­ంగిపొర్లాయి. రైతులకు అపార నష్టం వా­టి­ల్లింది. కోత కోసి పొలాల్లో ఉంచిన వరి ఓదెలు నీట మునిగాయి. పలుచోట్ల ఆరబె­ట్టిన ధాన్యం కూడా తడిచిపోయింది. 

ధాన్య­ం విక్రయించే సమయంలో కురిసిన అకాల వర్షం తమను నిండా ముంచేసిందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పలుకూరు, కను­మలచెరువు, పేరూరుపాడు, వెల్లటూ­రు గ్రా­మా­ల్లో వందలాది ఎకరాల్లో పంట నష్టం వా­టి­ల్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement