పులివెందుల: కూటమి ప్రభుత్వ మరో కుట్ర | Pulivendula Vontimitta ZPTC bypolls August 11th News Updates | Sakshi
Sakshi News home page

పులివెందుల: కూటమి ప్రభుత్వ మరో కుట్ర

Aug 11 2025 10:45 AM | Updated on Aug 11 2025 1:53 PM

Pulivendula Vontimitta ZPTC bypolls August 11th News Updates

పులివెందుల రూరల్‌, ఒంటిమిట్ట మండలాల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. రేపు(ఆగస్టు 12న) ఈ రెండు జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఈ రెండు స్థానాలకు 11 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత పులివెందులలో ఉప ఎన్నిక జరుగుతుండడం గమనార్హం. ఈ క్రమంలో అధికార టీడీపీ, వైఎస్సార్సీపీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

టీడీపీ నేతల కుట్రలపై ఎంపీ అవినాష్ రెడ్డి ఫైర్

  • ఓటరు స్లిప్పులను టీడీపీ నేతలు తీసుకోవటంఫై వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌ ఆగ్రహం

  • కొత్తపల్లి, నల్లపరెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లిలో టీడీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు తీసుకుంటున్నారు

  • ఇవ్వకపోతే బెదిరిస్తున్నారు

  • మూడురోజులుగా ఎన్నికల కమిషన్ దృష్టికి పదేపదే  తీసుకెళ్లాం

  • అయినా ఎన్నికల కమిషన్ మొద్దు నిద్ర వీడటం లేదు

  • టీడీపీ వారు ఇంటింటికీ వెళ్ళి డబ్బులు పంచుకున్నారు

  • డబ్బులిచ్చి ఓటర్ల స్లిప్పులను వెనక్కు తీసుకుంటున్నారు

  • దీని వలన ఎవరి ఓటు ఎక్కడ ఉందో ఓటరికి అర్థం కాదు

  • తాను ఏ బూతులో ఓటు వేయాలో కూడా ఓటరుకి అర్థం కాని పరిస్థితి వచ్చింది

  • ఎన్నికల కమిషన్ మొద్దు నిద్ర పోతోంది

  • ఓటరుకి తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం కల్పించాలి

  • ప్రతి ఒక్క ఓటరికీ మళ్లీ స్లిప్‌లను అందించాలి

  • ఈ రాత్రికి మొత్తం 10,601 ఓటర్లకు స్లిప్పులను ఇవ్వాలి

  • ఎర్రిపల్లిలో రాత్రే టీడీపీ నేతలు స్లిప్పులను తీసుకున్నారు

  • ఈరోజు మరికొన్ని గ్రామాలలో తీసుకోబోతున్నారు

  • మా పార్టీ మండల నాయకుల ఇళ్లకు కూడా వెళ్లి స్లిప్పులు అడుగుతున్నారు

  • నల్లపరెడ్డిపల్లి గ్రామానికి భారీగా బయటి వ్యక్తులు వచ్చారు

  • ఆ వచ్చినవారికి ఈ స్లిప్పులను ఇచ్చి దొంగ ఓటు వేయించబోతున్నారు

  • రిగ్గింగ్ చేసినట్టు కెమెరాలో కనపడకుండా ఇలాగ ప్లాన్ చేశారు

  • నిరంతరాయంగా ఇలా దొంగ ఓట్లు వేయటానికి మనుషులను దించారు

  • దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించాలి

పోలింగ్‌ బూత్‌ల మార్పు.. హైకోర్టులో విచారణ

  • ఏపీ హైకోర్టులో వైఎస్సార్‌సీపీ లంచ్ మోషన్ పిటిషన్

  • పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా  పోలింగ్ బూతులు మార్పులు సవాలు చేస్తూ పిటిషన్

  • మధ్యాహ్నం విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు

  • ఎన్నికల సంఘానికి పోలింగ్ బూత్‌ల మార్పుపై ఆదేశాలు ఇవ్వాలని కోరిన పిటిషన్

పులివెందులలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది: కారుమూరి

  • తణుకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు

  • స్వతంత్రం వచ్చిన తరువాత ఇటువంటి మెజార్టీలు ఎక్కడా చూడలేదు.

  • ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి కూటమి ప్రభుత్వం అక్రమ మార్గంలో గెలిచింది.

  • తణుకు నియోజకవర్గంలో ఆరిమిల్లి రాధాకృష్ణకు  72 వేల ఓట్లు ఈవీఎం ట్యాపరింగే.

  • ఎలక్షన్ జరిగిన తర్వాత  ఈవీఎం ట్యాపరింగ్లు జరిగిందని చెప్పిన  మొదటి వ్యక్తి నేనే.

  • ప్రజా సంక్షేమాన్ని అమలు చేసిన జగన్ మోహన్ రెడ్డి ఏమి చేయలేదని ప్రజలు ఓట్లు వేయలేదని నాయకులు చెబుతున్నారు .

  • కేవలం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి మాత్రమే గెలిచారు.

  • పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది.

పులివెందుల పోలీసులకు హైకోర్టులో చుక్కెదురు

  • పులివెందులలో వైఎస్సార్సీపీ నేతలపై దాడి సందర్భంలో నిర్వహించిన ర్యాలీపై పోలీసుల కేసు

  • వైఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి సహా 150 మందిపై కేసు పెట్టిన పోలీసులు

  • హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ

  • ఎవ్వరినీ అరెస్ట్ చేయవద్దని పోలీసులను సోమవారం ఆదేశించిన హైకోర్టు

పులివెందుల ఆగని పోలీసుల దాష్టీకం

  • పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసుల దాష్టీకం

  • వైఎస్సార్సీపీ నేతల అక్రమ నిర్బంధం

  • ఆరుగురిని ఆదివారం ఉదయం నుంచి పీఎస్‌లోనే ఉంచిన ఖాకీలు

  • పులివెందుల అప్‌గ్రేస్‌ పీఎస్‌లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న బాధితులు

  • పోలీసుల అదుపులో అర్జున్ (మొట్నుతలపల్లి), మస్తాన్ వలి (చంద్రగిరి), హరి (మల్లికార్జునపురం), మైసూరారెడ్డి (లక్షుంవారిపల్లి), రవి ప్రకాష్ రెడ్డి, నాయక్ (కనంపల్లి)

  • ఎన్నికల నేపధ్యంలో కీలకంగా ఉన్న నాయకులను వేధిస్తున్నారంటున్న వైఎస్సార్సీపీ

  • పోలింగ్ టీడీపీకి అనుకూలంగా మార్చడానికే అక్రమ నిర్బంధం అంటున్న వైఎస్సార్సీపీ

ఒంటిమిట్టలో..

  • ఒంటిమిట్టలో పోలింగ్‌ ఏర్పాట్లపై అధికారుల స్పందన

  • మీడియాతో మాట్లాడిన రిటైనింగ్ అధికారి రామలింగయ్య 

  • రేపు 7 గంటల నుండి 5గంటల వరకు పోలింగ్

  • ప్రతి పోలింగ్ స్టేషన్‌కి నలుగురు అధికారులు

  • బ్యాలెట్ బాక్స్ లు, ఎలక్షన్ మెటీరియల్ అందిస్తున్నాం..

  • సెక్యూరిటీతో పాటు పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తరలిస్తున్నాం..

  • రేపు పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం మౌలానా అబ్దుల కలాం  ఆజాద్ యూనివర్సిటీ లో భద్రపరుస్తాం

  • 14వ తేదీ కౌంటింగ్ ఉంటుంది

పులివెందుల మండలంలో నేడు..

  • స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పోలింగ్ సిబ్బందికి పులివెందుల ఉప ఎన్నిక బ్యాలెట్ బాక్స్ ల పంపిణి ప్రారంభం

  • జెడ్పీటీసీ ఉపఎన్నిక కు కావాల్సిన బ్యాలెట్ బాక్స్ ల పంపిణి చేస్తున్న ఎన్నికల అధికారులు

  • పోలింగ్ సిబ్బంది కి బూత్‌లవారీగా ఎలక్షన్ సామగ్రి, బ్యాలెట్ బాక్సుల పంపిణి

  • పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 15 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు

  • పోలింగ్ బూత్‌ల సిబ్బందికి ఎలక్షన్ సామగ్రి పంపిణి

రోజుకో కుట్ర.. కూటమి కుయుక్తి

  • జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు కూటమి ప్రభుత్వ అడ్డదారులు

  • వైఎస్సార్‌సీపీ నేతల అక్రమ అరెస్టులు, నిర్బంధాలు

  • అదే సమయంలో ఓటర్లకూ వేధింపులు

  • పోలింగ్ బూత్‌ల మార్పు తో ఓటర్లకు ఇబ్బంది

  • ఒక గ్రామంలోని ఓటర్లకు మరో గ్రామంలో పోలింగ్ కేంద్రం

  • పోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని, ఓటర్లు నిలువరించే ప్రయత్నాలు చేస్తారని వైఎస్సార్సీపీ పిర్యాదు

  • ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈసీ, గవర్నర్‌లకు వినతి

టార్గెట్‌ వైసీపీ కేడర్‌

  • పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సాక్షిగా టీడీపీ అరాచకాలు 

  • ఇప్పటికే దాడులు, హత్యయత్నాలతో అట్టుడుకుతున్న పులివెందుల

  • గ్రామాల్లో కీలక వైఎస్సార్సీపీ నాయకులను తప్పుడు కేసుల్లో అరెస్ట్

  • వందల మందిపై బైండోవర్ కేసులు

  • పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ నాయకులు కనపడకుండా కుట్రలు

  • కూటమి కుట్రలతో రణరంగంగా మారిన పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక

  • పులివెందుల, ఒంటిమిట్ట మొత్తం 750 మందిపై బైండోవర్‌ కేసు

  • ఒక్క పులివెందుల మండలంలోనే 500 మందిపై బైండోవర్ కేసులు

  • 52 మందిపై ఎస్సీ ఎస్టీ కేసులు, 9 మంది వైఎస్సార్సీపీ నాయకులను రిమాండ్ కు పంపిన పోలీసులు

కోడ్‌ ఉల్లంఘించి మరీ.. 

  • ప్రచార సమయం ముగిసిన కొనసాగుతున్న టీడీపీ పాలిటిక్స్ 

  • ఒంటిమిట్టలో ఏదేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కూటమి కీలక నేతలు

  • ఆదివారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసిన ప్రచారం

  • ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతర్ చేసిన కూటమి ప్రభుత్వ నేతలు 

  • ఆరు గంటల టైంలోనూ హరిత హోటల్ లో మకాం వేసిన టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ...

  • ముఖ్య నేతలకు వత్తాసు పలుకుతున్న పోలీసులు

పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలు.. రేపే పోలింగ్‌

  • పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు ముగిసిన ప్రచారం

  • రేపు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్

  • పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు

  • పులివెందులలో 10,601 ఓట్లు, ఒంటిమిట్టలో 24,600 ఓట్లు

  • పులివెందులలో భారీ బందోబస్తు

  • సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న పోలీసులు

  • పులివెందులలో ఐదు, ఒంటిమిట్టలో నాలుగు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తింపు

  • ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద డ్రోన్లతో నిఘా

  • రెండు మండలాలు, జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు

  • పోలింగ్‌ పూర్తయ్యే వరకు స్థానికేతరులు ఉండకూడదని పోలీసుల హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement