మంత్రి లోకేశ్‌కు గురువుల నిరసన సెగ | Protest against Nara Lokesh from teachers in Parvathipuram Manyam district | Sakshi
Sakshi News home page

మంత్రి లోకేశ్‌కు గురువుల నిరసన సెగ

Jun 10 2025 4:44 AM | Updated on Jun 10 2025 6:59 AM

Protest against Nara Lokesh from teachers in Parvathipuram Manyam district

సాక్షి, పార్వతీపురం మన్యం: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు పార్వతీపురం మన్యం జిల్లాలో గురువుల నుంచి నిరసన ఎదురైంది. షైనింగ్‌ స్టార్స్‌ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు మంత్రి సోమవారం పార్వతీపురం వచ్చారు. స్థానికంగా ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. 

లోకేశ్‌ పర్యటన విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు,ఆయనను కలిసి వినతి పత్రం అందించాలని నిర్ణయించారు. ఎస్జీటీలకు మాన్యువల్‌ విధానంలోనే బదిలీల విషయమై మంత్రిని కలిసి విన్నవించేందుకు ప్రయత్నించారు. కుదరకపోవడంతో రెండు బృందాలుగా టీచర్లు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు వేచి చూశారు. చివరికి మంత్రి లోకేశ్‌ ను ఉపాధ్యాయులు కలిశారు. తమ డిమాండ్లు వినిపించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement