తేనెటీగల దాడిలో శ్రీశైలం డీఈ మృతి

Honey Bees Attack Srisailam Project Divisional Engineer Last Breath - Sakshi

సాక్షి, కర్నూలు: శ్రీశైలం రిజర్వాయర్‌ వద్ద మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. తేనెటీగల దాడిలో శ్రీశైలం రిజర్వాయర్‌ బ్యాక్ కెనాల్ డివిజనల్ ఇంజనీర్ భానుప్రకాశ్‌ మృతి చెందారు. కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్‌ వద్ద విధుల్లో ఉండగా ఆయనపై ఒక్కసారిగా తేనెటీగల గుంపు దాడి చేసింది. పెద్ద ఎత్తున తేనెటీగలు దాడి చేయడంతో భానుప్రకాశ్‌ ప్రాణాలు విడిచారు. ఇదిలాఉండగా.. గత నెలలో శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో 9 మంది ఉద్యోగులు మరణించిన సంగతి తెలిసిందే. 
(చదవండి: విషాదం: లోపలున్న 9 మందీ మృతి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top