గన్నవరం ఘటనలో టీడీపీ నేతలకు 14 రోజుల రిమాండ్.. | Sakshi
Sakshi News home page

గన్నవరం ఘటనలో టీడీపీ నేతలకు 14 రోజుల రిమాండ్..

Published Tue, Feb 21 2023 9:57 PM

gannavaram tdp office attack local court remanded 14 days to pattabhiram - Sakshi

గన్నవరం ఘటనలో టీడీపీ నేత పట్టాభికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పట్టాభితో పాటు మరో 10 మందికి రిమాండ్‌ విధిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అదే విధంగా చికిత్స నిమిత్తం పట్టాభిని విజయవాడ ఆస్పత్రికి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.

మిగిలిన 10 మందిని రాజమండ్రి జైలుకు తరలించాలని పోలీసులకు న్యాయమూర్తి సూచించారు.  కాగా గన్నవరం సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement