అనవసర వ్యయం వద్దు: ఏపీ ఆర్ధికశాఖ | Finance Ministry guidelines in the context of Covid 19‌ | Sakshi
Sakshi News home page

అనవసర వ్యయం వద్దు: ఏపీ ఆర్ధికశాఖ

Mar 31 2021 3:00 AM | Updated on Mar 31 2021 9:37 AM

Finance Ministry guidelines in the context of Covid-19‌ - Sakshi

కోవిడ్‌ నేపథ్యంలో అనవసర వ్యయాన్ని కట్టడి చేయాలని అన్ని శాఖలకు ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధికశాఖ సూచించింది.

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నేపథ్యంలో అనవసర వ్యయాన్ని కట్టడి చేయాలని అన్ని శాఖలకు ఆర్ధికశాఖ సూచించింది. కోవిడ్‌ వల్ల ఆదాయ వనరులు తగ్గిపోయినందున ప్రాధాన్యతలను గుర్తించి ఆ రంగాలకే వ్యయం చేయాలని ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్‌ మంగళవారం ఉత్తర్వులిచ్చారు.

ఓటాన్‌ అకౌంట్‌ కేటాయింపుల మేరకే పనులకు సంబంధించిన బిల్లులను సమర్పించాలని, కేటాయింపుల్లేని పనులకు బిల్లులను సమర్పించరాదని స్పష్టం చేశారు. ఏప్రిల్‌ నుంచి జూన్‌ చివరి వరకు ‘ఓటాన్‌ అకౌంట్‌’లో తిరిగి కేటాయింపులకు అనుమతించేది లేదన్నారు. వేతనాలు, పెన్షన్‌లు, గౌరవ వేతనాలు తదితరాలకు నియంత్రణ నుంచి మినహాయింపు ఇచ్చామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement