సాక్షి, కడప: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై అనుచిత వాఖ్యలు చేసిన పంతం నానాజీపై మాజీ ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జనసేన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. ఈ విద్వేషపూరిత వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని సదరు ఎమ్మెల్యేపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.


