ఎమ్మెల్యే భూమనకు సీఎం జగన్‌ పరామర్శ

CM YS Jagan Consultation To Bhumana Karunakar Reddy - Sakshi

సాక్షి, అమరావతి: తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. రెండవసారి కరోనా సోకి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందతున్న భూమనకు శనివారం ఉదయం ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూమనకు సీఎం జగన్‌ పలు సూచనలు చేశారు. రెండవసారి కరోనా సోకిన నేపథ్యంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ.. మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి బుధవారం కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ రిపోర్టు వచ్చిన సంగతి తెలిసిందే.   (ఎమ్మెల్యే భూమనకు మరోసారి కరోనా)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top