హైకోర్టు సీజేను కలిసిన సీఎం వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

హైకోర్టు సీజేను కలిసిన సీఎం వైఎస్‌ జగన్‌

Published Thu, Aug 31 2023 7:53 AM

Cm Jagan Meets Ap High Court Cj Justice Dhiraj Singh Thakur - Sakshi

సాక్షి, అమరావతి: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలు­సు­­కు­న్నారు. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి దంపతులు విజయవాడలోని ప్రధాన న్యాయ­మూర్తి నివాసానికి వెళ్లారు.

సీఎం జగన్, ఆయన సతీమణి భారతిలను సీజే జస్టిస్‌ ఠాకూర్‌ దంప­తులు పుష్పగుచ్ఛాలతో సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సీజేకు సీఎం పుష్ప­గుచ్ఛం ఇచ్చి సన్మా­నించారు. ఇటీవల సీజేగా జస్టిస్‌ ఠాకూర్‌ బాధ్యతలు చేపట్టిన నేప­థ్యంలో ముఖ్యమంత్రి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
చదవండి: మాట ఇచ్చారు.. వెంటనే ఆదుకున్నారు

Advertisement

తప్పక చదవండి

Advertisement