పిఠాపురంలో ‘గ్లాస్‌’ మేట్స్‌ గలాటా | Clash Between TDP and Janasena Activists in Pithapuram: Andhra pradesh | Sakshi
Sakshi News home page

పిఠాపురంలో ‘గ్లాస్‌’ మేట్స్‌ గలాటా

Apr 15 2025 4:18 AM | Updated on Apr 15 2025 4:18 AM

Clash Between TDP and Janasena Activists in Pithapuram: Andhra pradesh

అంబేడ్కర్‌ సాక్షిగా జనసేన నాయకుల కుమ్ములాటలు  

పిఠాపురం: జనసేన అధి­నేత పవన్‌ కళ్యాణ్‌ ఇలాకా పిఠాపురంలో నిన్నటి వరకూ టీడీపీ, జనసేన నాయకులే కొట్టుకుంటూ రాగా...­తా­జాగా  జనసేనలోనే రెండు వర్గా­లు బాహాబాహీ­కి దిగాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. పిఠాపు­రంలో సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలు జరిగాయి. పార్టీ తరపున పలు కార్యక్రమాల్లో పిఠాపురం జనసే­న ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఆయన వెంట హాజరైన జనసేన నేతల్లో కొందరు రెండు వర్గాలుగా విడిపోయి వివాదానికి తెర లేపారు.

పిఠాపురం పట్టణం ఇందిరా నగర్‌ రజాల­పేట­లో ఇరువర్గాలూ వాగ్వాదానికి దిగాయి. ‘పార్టీ పెట్టినప్పటి నుంచీ ఉన్న మేమే అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో పాల్గొంటామని, మీరు వెనకాల రావాలని’ ఓ వర్గాన్ని మరో వర్గం అడ్డ­గించింది.‘మమ్మల్ని అడ్డుకోడానికి మీరెవరు? మీరు ఎప్పుడు వస్తే మాకేంటి? మేము పార్టీకి పని చేశాం. మేమూ నేతలమే.

మేం వస్తాం, ఎవరడ్డుకుంటారో చూ­స్తాం’ అంటూ మరో వర్గం తిరగబడింది. దీంతో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు పెరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గా­లనూ సముదాయించేందుకు కొందరు చేసిన ప్రయత్నాలు చాలాసేపు ఫలించలేదు. ఈ గొడవను కవర్‌ చేసేందుకు ప్రయ­త్నించిన మీడి­యా ప్రతినిధులపై  జన­సేన నేతలు దురు­సుగా ప్రవర్తించారు. దీనిపై మీడియా ప్రతినిధులు తీవ్ర నిరసన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement