డీఎస్సీపై త్వరలో ప్రకటన  | Botsa Satyanarayana Comments On DSC Notification | Sakshi
Sakshi News home page

డీఎస్సీపై త్వరలో ప్రకటన 

Mar 24 2023 4:21 AM | Updated on Mar 24 2023 4:21 AM

Botsa Satyanarayana Comments On DSC Notification - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ ప్రకటనపై త్వరలో స్పష్టత వస్తుందని, ఇందుకు సంబంధించి జూలై–ఆగస్ట్‌లో కార్యాచరణ చేపడతామని రాష్ట్ర విద్యా­శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో గురువారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దశల వారీగా టీచర్‌ పోస్టులు భర్తీ చేశామన్నారు.

సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉండాల్సిన టీచర్‌ పోస్టులు ఎన్ని? వాటిలో ఎన్ని పోస్టు­లు భర్తీ అయ్యాయి? ఇంకా ఎన్ని పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది? అనే అంశాలపై నివేదిక సిద్ధం చేస్తు­­న్నామన్నారు. నివేదికను సీఎంకు వివరించి ఆ­య­న తదుపరి ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న పో­స్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement