దేశాభివృద్ధిలో రాజీలేని తత్వం వాజ్‌పేయిది

Biswabhusan harichandan comments on Atal Bihari Vajpayee - Sakshi

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ 

సాక్షి, అమరావతి: దేశాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే పరి­మితం కాకుండా దేశ రక్షణ అవస­రాల పరంగానూ మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారి వాజ్‌­పేయి రాజీ పడలేదని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొ­న్నారు. దేశాభివృద్ధి విష­యంలో ఆయన ఎంతో ముందుచూపుతో వ్యవ­హరించారన్నారు. వాజ్‌పేయి జయంతి సందర్భంగా రాజ్‌భవన్‌లో ఆదివారం సుపరి­పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వ­హించారు.

దర్బార్‌ హాల్‌లో జరిగిన కార్య­క్రమంలో వాజ్‌పేయి చిత్రపటా­నికి గవర్నర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సం­దర్భంగా గవర్నర్‌ విశ్వభూషణ్‌ మాట్లా­డుతూ.. దేశాభివృద్ధికి వాజ్‌పేయి చేసిన కృషి మరువలేని­దని ‘స్వర్ణ చతుర్భుజి’ కార్యక్ర­మాన్ని ప్రారంభించి దేశంలో మౌలిక సదుపా­యాల అభివృద్ధికి మార్గం చూపారన్నారు. నాలుగు మెట్రో­పాలి­టన్‌ నగరాలను కలు­పుతూ ఏర్పాటు చేసిన హైస్పీడ్‌ జాతీయ రహ­దారుల ప్రాజెక్ట్‌ ఫలాలను ఇప్పుడు ప్రజలు ఆస్వాదిస్తున్నార­న్నారు.

60 ఏళ్లు పైబడిన పేద వృద్ధులకు 10 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేసి సంక్షేమ రంగంలో కొత్త ఒరవడి సృష్టించారని గుర్తు చేశారు. గ్రామాలను కలుç­³#తూ ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన, ప్రాథమిక, మాధ్యమిక విద్య నాణ్యతను పెంపొందించేందుకు సర్వశిక్షా అభియాన్‌ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వాజ్‌పేయి హయాంలో ప్రారంభమయ్యాయన్నారు.

అణుపరీక్షల వేళ ప్రపంచంలోని పెద్ద శక్తులు వాజ్‌పేయిపై విరుచుకుపడగా ఐదు పరీక్షలను విజయవంతంగా పూర్తి­చేసిన తరువాత అణుశక్తి దేశంగా భారత్‌ను ప్రకటించారని గుర్తు చేసారు. వాజ్‌పేయి ధైర్యవంతమైన చర్యల ఫలితంగా ప్రవాస భారతీ­యులు గర్వంగా, గౌరవంగా జీవించగలుగుతున్నారని గవ­ర్నర్‌ హరి­చం­దన్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్‌భవన్‌ సంయుక్త కార్యదర్శి సూర్యప్రకాశ్, ఉపకార్యదర్శి నారా­యణస్వామి, పలువురు మాజీ సైనికాధికారులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top