‘బీసీలంతా జగనన్నకు సెల్యూట్ చేస్తున్నారు’
సాక్షి, కృష్ణా: బీసీలకు ఆత్మగౌరవాన్నిచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఏపీ మంత్రి జోగిరమేష్ ఉద్ఘాటించారు. సోమవారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనపై జోగి రమేశ్ స్పందించారు. ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో బీసీలకు పెద్దపీట వేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
బలహీన వర్గాలకు సీఎం జగనన్న అగ్రస్థానం కల్పించారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వెనుకబడిన తరగతులను అందలం ఎక్కించిన ఏకైక నేత బహుశా జగనన్నే!. చట్టసభల్లో మా హక్కులను కాపాడుకునేందుకు ఆయన అవకాశం కల్పించారు. జగనన్న వల్ల బీసీలంతా తలెత్తుకుతిరుగుతున్నారు. బీసీలంతా జగనన్నకు సెల్యూట్ చేస్తున్నారు. భారతదేశ చరిత్ర పుటల్లో సీఎం జగన్ నిలిచిపోతారు అని పేర్కొన్నారు.
బీసీలంతా సీఎం జగన్ వెంటే..
సాక్షి, గుంటూరు: సీఎం జగన్ బీసీలను రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి కవురు శ్రీనివాస్. గతంలో ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, డీసీసీబీ చైర్మన్ గా అవకాశం ఇచ్చి.. నేడు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు ప్రకటించిన 18ఎమ్మెల్సీల్లో 14మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చారు. అలాగే పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు. బీసీలంతా సీఎం జగన్ వెంటే ఉంటారు. బీసీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా చేసిన ఘనత జగన్ దే అని కవురు శ్రీనివాస్ తెలిపారు.