
సాక్షి,విశాఖ: ఏపీలో ఎంబీఏ,ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్- 2025 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ విడుదల చేశారు. ఏపీ ఐసెట్ పరీక్షా ఫలితాల్లో 95.86శాతం విద్యార్థులు అర్హత సాధించారు. ఈ ఫలితాల్లో విశాఖకు చెందిన మేక మనోజ్ మొదటి ర్యాంక్ సాధించగా.. వైఎస్సార్ జిల్లాకు చెందిన సందీప్రెడ్డి రెండో ర్యాంక్ను సాధించారు.