దిన్నెమీద గంగమ్మ లేఅవుట్‌ పరిశీలన  | Andhra Pradesh RDO Officer Inspected Layout Of Gangamma In Pileru | Sakshi
Sakshi News home page

దిన్నెమీద గంగమ్మ లేఅవుట్‌ పరిశీలన 

Sep 9 2022 10:36 PM | Updated on Sep 10 2022 2:52 PM

Andhra Pradesh RDO Officer Inspected Layout Of Gangamma In Pileru - Sakshi

స్థలాలు పరిశీలిస్తున్న ఆర్డీఓ రంగస్వామి  

పీలేరు : మండలంలోని కాకులారంపల్లె పంచాయతీ దిన్నెమీద గంగమ్మ లేఅవుట్‌ను రాయచోటి ఆర్డీఓ రంగస్వామి పరిశీలించారు. దిన్నెమీద గంగమ్మ లేఅవుట్‌ జగనన్న కాలనీ, ఆటో నగర్‌లో ఆక్ర మణలు జరిగినట్లు కొత్తపల్లెకు చెందిన దేవేంద్రరెడ్డి స్పందనలో ఫిర్యాదు చేశాడు. దీంతో గురువారం ఆర్డీఓ దిన్నెమీద గంగమ్మ లేఅవుట్‌ను ఆటో నగర్‌లోని స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ఇది వరకే దిన్నెమీద గంగమ్మ లేఅవుట్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో వీఆర్వో హేమంత్‌ నాయక్, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ఆసిఫ్‌ను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్డీఓ స్థలాలను పరిశీలించారు.  అలాగే మండలంలో ల్యాండ్‌ కన్వర్షన్‌ స్థలాలు పరిశీలించారు.

పీలేరు పంచాయతీ సర్వే నెంబరు 42లో 3.60 ఎకరాలు, ముడుపులవేములలో సర్వే నెంబరు 405/3లో ఒక ఎకరా, బోడుమల్లువారిపల్లెలో సర్వే నెంబరు 731లో ఒక ఎకరా, 715లో రెండు ఎకరాలు, 711లో 90 సెంట్లు, 636లో 83 సెంట్లు, 639లో 1.84 ఎకరాలకు సంబంధించి ల్యాండ్‌ కన్వర్షన్‌కు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ రవి, ఆర్‌ఐలు రాజశేఖర్, భార్గవి,  సర్వేయర్‌ దేవి పాల్గొన్నారు.     

Advertisement
 
Advertisement
Advertisement