రిమాండ్‌ కారణాలను రికార్డ్‌ చేయాల్సిందే

Andhra Pradesh High Court Says Reasons for remand must be recorded - Sakshi

సాక్షి, అమరావతి: నిందితుడిని రిమాండ్‌కు పంపే సమయంలో అందుకుగల కారణాలను మేజిస్ట్రేట్‌లు తప్పనిసరిగా రికార్డ్‌చేసి తీరాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. వారు యాంత్రికంగా వ్యవహరించకుండా కేసు పూర్వాపరాలను పరిగణనలోకి తీసుకుని ఆ తరువాతే సహేతుక ఉత్తర్వులు జారీచేయాలని స్పష్టంచేసింది.

రిమాండ్‌ ఉత్తర్వులు లోపభూయిష్టంగా ఉన్నట్లు తాము (హైకోర్టు) గమనించినా, నిందితుల తరఫున తమ దృష్టికి తీసుకొచ్చినా ఆ మేజిస్ట్రేట్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top