వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్‌ జయంతి వేడుకలు

Ambedkar Jayanti Celebrations At YSRCP Central Office In Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి: అంబేద్కర్‌ ఆశయాలను తూచ తప్పకుండా పాటిస్తూ అణగారిన వర్గాలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్‌ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.

 చదవండి: రాజ్యాంగానికి ప్రతిరూపం అంబేడ్కర్‌: సీఎం జగన్‌

కార్యక్రమానికి మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. నిన్నటి మంత్రి వర్గ విస్తరణలో అంబేద్కర్‌ ఆశయాలను సీఎం వైఎస్‌ జగన్‌ తూచ తప్పకుండా పాటించారని, మహనీయుడు అంబేద్కర్‌ అందించిన రాజ్యాంగమే స్పూర్తిగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని పలువురు వక్తలు అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top