సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా సహకార డెయిరీలను ప్రోత్సహించేందుకు వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తగిన తోడ్పాటునందిస్తామని నాబార్డు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పాడి అభివృద్ధికి రూ.8,232.33 కోట్ల మేర రుణ ఆవశ్యకత ఉన్నట్లు నాబార్డు అంచనా వేసింది. 2021–22లో మొత్తంగా పశు సంవర్ధక రంగానికి రూ.12,606 కోట్ల మేర రుణ ఆవశ్యతక ఉంటుందని రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 15.87 శాతం ఎక్కువని తెలిపింది. పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్.. మొత్తం దేశంలోనే 4వ స్థానంలో ఉందని వెల్లడించింది. 2019–20లో 152.63 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి జరిగినట్లు తెలిపింది. దీని విలువ రూ.57,433 కోట్లుగా పేర్కొంది. ఏపీలో రోజూ 380 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోందని వివరించింది. ఇందులో 46 శాతం రాష్ట్ర సొంత అవసరాల కోసం.. మరో 34 శాతం అసంఘటిత రంగాలు వినియోగిస్తుండగా, 18 నుంచి 20 శాతం సహకార, ప్రైవేట్ పాల ఉత్పత్తుల రంగాలకు వెళ్తున్నాయని నాబార్డు పేర్కొంది.
డెయిరీ అభివృద్ధిపై దృష్టి..
పాడి అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని.. ఈ నేపథ్యంలో తాము కూడా డెయిరీ అభివృద్ధిపై దృష్టి సారించినట్లు నాబార్డు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా మహిళలకు అందించిన ఆర్థిక సాయానికి తోడుగా బ్యాంకుల నుంచి కూడా రుణాలు మంజూరు చేయించి పశు సంపదను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటోంది. అలాగే మహిళా పాడి రైతులకు మరింత ఆర్థిక ప్రయోజనం చేకూర్చేందుకు వారి నుంచి ఎక్కువ ధరకు పాలు కొనుగోలు చేసేలా.. అమూల్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో అమూల్ సంస్థ ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో పాల సేకరణ చేస్తోంది. అలాగే మహిళా డెయిరీ సహకార సంఘాలకు పూర్తి ప్రోత్సాహం అందించే విధంగా 9,899 గ్రామాల్లో ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల నిర్మాణాలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నాబార్డు కూడా ఈ ఆర్థిక సంవత్సరం పాడి అభివృద్ధికి రూ.8,232.33 కోట్ల మేర రుణాల ఆవశ్యకత ఉన్నట్లు అంచనా వేసింది.
పశు సంవర్ధకానికి రూ.12,606 కోట్ల రుణం
Published Mon, Apr 19 2021 3:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?
సీవీడ్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
మిస్టర్ బీస్ట్ బర్త్డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్’ (ఫొటోలు)
బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!
టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement