‘యోగాంధ్ర’కు 280 బస్సులు | - | Sakshi
Sakshi News home page

‘యోగాంధ్ర’కు 280 బస్సులు

Jun 19 2025 4:12 AM | Updated on Jun 19 2025 4:12 AM

‘యోగాంధ్ర’కు 280 బస్సులు

‘యోగాంధ్ర’కు 280 బస్సులు

అనంతపురం క్రైం: కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో నిర్వహిస్తున్న యోగాంధ్ర–2025 కార్యక్రమానికి అనంతపురం ఆర్టీసీ రీజియన్‌ నుంచి 280 బస్సులు వెళ్లనున్నాయి. జిల్లాలో ఆయా బస్సు రూట్లను 20వ తేదీ రాత్రి నుంచి రద్దు చేశారు. కూటమి సర్కారు వచ్చిన నాటి నుంచి ఇష్టారాజ్యంగా ఆర్టీసీ బస్సులను దారి మళ్లిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కడపలో నిర్వహించిన టీడీపీ మహానాడు కార్యక్రమానికి ఏకంగా 400కు పైగా బస్సులను తరలించారు. దీంతో అప్పట్లో ప్రయాణికులు పడరాని పాట్లు పడ్డారు. తాజాగా యోగాంధ్ర అంటూ విశాఖ పట్నానికి బస్సులను మళ్లిస్తుండడంపై ప్రజలు మండిపడుతున్నారు. సామాన్యుల గురించి పట్టించుకోరా అంటూ నిలదీస్తున్నారు. ఉన్నట్లుండి బస్సులను రద్దు చేస్తే సామాన్యులు ఎంత ఇబ్బంది పడతారో టీడీపీ నేతలు, ఉన్నతాధికారులు ఆలోచించాలని సూచిస్తు న్నారు. ఇదిలాఉంటే.. ఇష్టారాజ్యంగా బస్సుల మళ్లింపుపై ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే ఆలోచనలో పడినట్లు తెలిసింది.

జెడ్పీ సీఈఓ శివశంకర్‌

బాధ్యతల స్వీకరణ

అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధి కారి(సీఈఓ)గా శివశంకర్‌ బుధవారం బాధ్యతలు చేపట్టారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో డ్వామా ఏపీడీగా పని చేస్తున్న ఆయన్ను జెడ్పీ సీఈఓగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య నుంచి ఆయన చార్జ్‌ తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement