ఖరీఫ్‌కు 1.07 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు | - | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌కు 1.07 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు

Jun 16 2025 5:37 AM | Updated on Jun 16 2025 5:37 AM

ఖరీఫ్‌కు 1.07 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు

ఖరీఫ్‌కు 1.07 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు

అనంతపురం అగ్రికల్చర్‌: ఈ ఖరీఫ్‌లో జిల్లాకు 1,07,302 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళిక రచించారు. 4.38 లక్షల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగులోకి రావొచ్చని అంచనా వేశారు. ఎరువుల ప్రతిపాదనలకు కమిషనరేట్‌ నుంచి అనుమతులు లభించినట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. కంపెనీల వారీగా ఎరువుల కోటా టార్గెట్లు విధించారు. అలాగే నెలవారీగా అవసరమైన ఎరువులు సరఫరా చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.సెప్టెంబర్‌తో ముగిసే ఖరీఫ్‌ కాలానికి 1,07,302 మెట్రిక్‌ టన్నులు అవసరమని ఎరువుల ప్రణాళిక తయారు చేశారు. అందులో అత్యధికంగా వివిధ రకాల కాంప్లెక్స్‌ ఎరువులు 53,446 మెట్రిక్‌ టన్నులు కాగా 26,839 మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా చేయనున్నారు. అలాగే 18,261 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 4,735 మెట్రిక్‌ టన్నుల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ (ఎంఓపీ), సింగిల్‌ సూపర్‌ పాస్ఫేట్‌ (ఎస్‌ఎస్‌పీ) 4,021 మెట్రిక్‌ టన్నులు అవసరమవుతాయని తెలిపారు. ఇండెంట్‌ మేరకు కంపెనీలు, మార్క్‌ఫెడ్‌ ద్వారా ఆర్‌ఎస్‌కేలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (సొసైటీ), రిటైల్‌, హోల్‌సేల్‌ డీలర్లకు సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే 40 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు జిల్లాలో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. 15 వేల మెట్రిక్‌ టన్నుల చొప్పున కాంప్లెక్స్‌, యూరియా ఉండగా, 3 వేల మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 6 వేల మెట్రిక్‌ టన్నుల ఎంఓపీ, 2 వేల మెట్రిక్‌ టన్నుల ఎస్‌ఎస్‌పీ ఎరువులు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.

అత్యధికంగా 53,446

మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement