నాతవరం: మండలానికి చెందిన నలుగురు విద్యార్థులు సాఫ్ట్బాల్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం ఆనందంగా నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు అన్నారు.నాతవరం స్కూల్లో ఆదివారం రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను ఎన్ఆర్ఐ సతీష్, స్థానిక గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు అభినందించారు, ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ నాతవరం హైస్కూల్లో చదువుతున్న అఖిల, గ్రేస్ బాలికల విభాగం నుంచి, జస్వంత్, సింహాద్రి బాలుర విభాగం నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారన్నారు. ఎన్ఆర్ఐ సతీష్ మాట్లాడుతూ విద్యాతోపాటు చదువు ముఖ్యమన్నారు.


