వర్షాలు లేక వరినాట్లు వేసే పరిస్థితి లేకపోయింది. వరినారు కళ్లముందే ముదిరిపోతోంది. ఈ ఏడాది మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఖరీఫ్ పంటల సాగుకు నీటి సమస్య ఏర్పడింది. ఏం చేయాలో తెలియడం లేదు.
– డి.కనకరాజు, గిరిజన రైతు, చింతలపూడి, కొయ్యూరు మండలం
70 ఎకరాల్లో వరినాట్లు పడలేదు
ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురవకపోవడంతో భూములు బీడులుగా మారాయి. రెండో దుక్కి పనులకు వర్షం కరువైంది. వరినాట్లకు సమయం కూడా మించిపోయింది. ఇప్పుడు వర్షాలు కురిసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. 70 ఎకరాల్లో వరినాట్లు పడలేదు.
– పాంగి అప్పారావు,
గిరిజన రైతు, ఉర్రాడ
తిండి గింజలకు ఇబ్బందులు తప్పవు
వర్షాలు లేక ఖరీఫ్లో వరి సాగుకు దూరమయ్యాం. వేసిన నారంతా నిరుపయోగంగా మారింది. ఈ ఏడాది తిండి గింజలకు ఇబ్బందులు తప్పవు.
– డప్పోడి రాజులమ్మ, వర్తనాపల్లి, పాడేరు మండలం


