
అబద్ధాలు, అరాచకాలే కూటమి పాలన
ముంచంగిపుట్టు: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాదిగా అబద్ధాలు, అరాచకాలతో పాలన సాగిస్తోందని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర విమర్శించారు. మండల కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం జగన్ అంటే నమ్మకం–చంద్రబాబు అంటే మోసం పేరుతో ముద్రించిన పుస్తకాన్ని ఎంపీపీ సీతమ్మ, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల నేతలతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుభద్ర మాట్లాడుతూ ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చిన చంద్రబాబు, పవన్కల్యాణ్ ఆ తరువాత వాటిని విస్మరించి ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. అక్రమాలు, కేసులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు కూటమి పాలనలో పెరిగిపోతున్నాయని ఆమె ధ్వజమెత్తారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మొదటి ఏడాదిలోనే ఇచ్చిన నవరత్నాలు పథకాలను పూర్తి స్థాయిలో వైఎస్ జగనన్న అమలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేశామని, ఇకపై వాటి ఊసెత్తకూడదని సీఎం చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరబీరు జగబంధు, సర్పంచులు రమేష్, బాబురావు, నీలకంఠం, గంగాధర్, నరసింగరావు, పార్వతమ్మ, ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, కమల, నోబ్బో, గణపతి తదితరులు పాల్గొన్నారు.
గిరిజనులను మోసం చేసిన చంద్రబాబు:
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయ టౌన్: ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు గిరిజనులను మోసం చేశారని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శించారు. మంగళవారం ఆయన తన క్యాంప్ కార్యలయంలో మండలంలోని పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పేరుతో ముద్రించిన వెన్నుపోటు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాదారు. ఎన్నికలకు ముందు అరకులో జరిగిన బహిరంగ సభలో గిరిజన ప్రాంతంలో గిరిజన అభ్యర్థులకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి పోష్టులు భర్తీ చేస్తానని, జీవో నంబర్ 3కు ప్రత్యామ్నాయంగా జీవో తీసుకువచ్చి శతశాతం ఉద్యోగాలు గిరిజన నిరుద్యోగ యువతకు ఇస్తానని మాటిచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని తుంగలో తొక్కారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పా లు, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, మండల పార్టీ అధ్యక్షులు స్వాభి రామూర్తి, మండల పార్టీ ఉపాధ్యక్షులు జి. ప్రకాష్, పల్టాసింగి విజయ్ కుమార్, ఎంపీటీసీలు దురియా ఆనంద్కుమార్, శత్రుఘ్న పాల్గొన్నారు.
ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్
జల్లిపల్లి సుభద్ర ధ్వజం
ముంచంగిపుట్టులో ‘వెన్నుపోటు’పుస్తకావిష్కరణ

అబద్ధాలు, అరాచకాలే కూటమి పాలన