
వెబ్ల్యాండ్లో నమోదు చేయాలి
● దేవదాయశాఖ జిల్లా అధికారి సుధారాణి
కొయ్యూరు: జిల్లాలో దేవదాయ శాఖ ఆధీనంలో ఉన్న భూములను వెబ్ల్యాండ్లో నమోదుచేయాలని తహసీల్దార్లను కోరామని ఆశాఖ జిల్లా అధికారి (డీఈవో) ఎల్. సుధారాణి తెలిపారు. మంగళవారం ఆమె కొయ్యూరులో మల్లికార్జున స్వామి, గంగాలమ్మ, బూరుగులమ్మ తల్లి ఆలయాలను, దేవదాయశాఖ భూములను పరిశీలించారు. భూములకు సంబంధించి సమగ్ర వివరాలను ఆమె తెలుసుకున్నారు. అనంతరం ఆమె తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. తమ శాఖ భూములను వెబ్ల్యాండ్లో నమోదు చేయాలని తహసీల్దార్ కుమారస్వామిని కోరారు. కాకరపాడులో నిర్మిస్తున్న వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని పరిశీలించారు. ఆమె వెంట దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఉమాదేవి, జూనియర్ సహాయకులు చంద్రతేజ, జీసీసీ మాజీ చైర్మన్ ప్రసాద్, బీజేపీ నాయకుడు మేడిబోయిన చక్రరావు, పద్మరాజు, నాగేశ్వరరావు, సర్పంచ్ మాకాడ బాలరాజు పాల్గొన్నారు.