
సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
● ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం
రంపచోడవరం: అర్జీదారుల సమస్యల పరిష్కారాని కృషి చేయాలని స్థానిక ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అధికారులను ఆదేశించారు. ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 71 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ సమస్యలను సత్వరం పరిష్కరించాలన్నారు. స్థానిక ఎస్టీ కాలనీలో పాత పద్ధతిలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాలను కొనసాగించాలని ముర్ల వెంకటేష్రెడ్డి, పల్లాల భాగ్యవతి, లోత స్వర్ణవిజయ అర్జీ అందజేశారు. వై. రామవరం మండలం బొబ్బిలోవ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మించాలని పల్లాల సోమిరెడ్డి, అందాల బొబ్బిల రెడ్డిలు విజ్ఞప్తి చేశారు. ఇదే మండలంలో ఎగువ ప్రాంతం బొడ్డగండి గ్రామంలో కమ్యూనిటీ భవనం నిర్మించాలని,మంగంపాడు పీహెచ్సీ వైద్యాధికారులకు, సిబ్బందికి, ఉపాధ్యాయులకు నివాస గృహాలు నిర్మించాలని సరం కోటఅబ్బాయిరెడ్డి పీవోకు అర్జీ అందజేశారు.