
ప్రజల్లోకి చంద్రబాబు మోసాలు
● నేడు జగన్ అంటే నమ్మకం–
చంద్రబాబు అంటే మోసం
పుస్తకావిష్కరణ
● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయ టౌన్: చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈనెల 16వ తేదీ సోమవారం అరకులోయలో జగన్ అంటే నమ్మకం–చంద్రబాబు అంటే మోసం పేరిట ముద్రించిన పుస్తకాలను ఆవిష్కరిస్తామని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. తన క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, జిల్లా కార్యవర్గ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.