
ఏజెన్సీలో భారీ వర్షం
సాక్షి,పాడేరు: ఏజెన్సీలోని పాడేరుతో పాటు పలు మండలాల్లో శనివారం భారీ వర్షం కురిసింది.మధ్యాహ్నం 12గంటల నుంచి వాతావరణం చల్లబడింది. హుకుంపేట, పాడేరు మండలాల్లో సుమారు 2గంటల పాటు కుండపోతగా కురిసిన భారీ వర్షంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. పాడేరు ఘాట్లో భారీ వర్షం కురవడంతో వాహనచోదకులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
జి.మాడుగుల: మండలంలో పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. పాడేరు–జి.మాడుగుల, చింతపల్లి, నుర్మతి, మద్దిగరువు, సొలభం,గడుతూరు పెదలోచలి, వంజరి, గెమ్మెలి, లువ్వాసింగి మార్గాల్లో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు.

ఏజెన్సీలో భారీ వర్షం