
కిలో గంజాయి స్వాధీనం
● ఇద్దరు యువకుల అరెస్టు
మోతుగూడెం: డొంకరాయి పోలీస్ స్టేషన్ పరిధిలో కేజీ గంజాయితో ఇద్దరు యువకులు పట్టుబడినట్టు శనివారం ఎస్ఐ శివకుమార్ తెలిపారు. డొంకరాయి గ్రామ శివారులో అనుమానంగా సంచరిస్తున్న ఇద్దరు యువకులను విచారించగా వారి వద్ద కేజీ గంజాయి పట్టుబడిందన్నారు. వీరు కరీంనగర్ పట్టణానికి చెందిన లకావత్ శివాజీ, బానోతు ఆనంద్గా గుర్తించి కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. చింతూరు సీఐ తెల్లం దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఆయన పేర్కొన్నారు.