ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం

Jun 15 2025 7:59 AM | Updated on Jun 15 2025 7:59 AM

ఘనంగా

ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం

సాక్షి, పాడేరు: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని కలెక్టరేట్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశాల మేరకు కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రెడ్‌ క్రాస్‌ సోసైటీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు ప్రారంభించారు.

రక్తదాతల దినోత్సవ స్పూర్తిదాత కార్ల్‌ లాండ్‌ స్టినార్‌ చిత్రపటానికి ఎస్‌డీసీతో పాటు రెడ్‌ క్రాస్‌ సోసైటీ ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌డీసీ లోకేశ్వరరావు మాట్లాడుతూ ఆస్ట్రేలియా దేశానికి చెందిన కార్ల్‌ లాండ్‌ స్టినార్‌ 1901లో మొట్టమొదటి సారిగా మానవరక్తాన్ని వర్గీకరించి, నోబుల్‌ విజేతగా నిలిచారన్నారు. ప్రతి ఏటా ఆయన జయంతి జూన్‌ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ప్రజలంతా రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలవాలన్నారు. రెడ్‌క్రాస్‌ సోసైటీ గిరిజన ప్రాంతాల్లో విశేష సేవలందిస్తుందన్నారు. రక్తదానం చేసి తోటి మనుషుల ప్రాణాలు కాపాడుతున్న రక్తదాతలంతా అభినందనీయులన్నారు. అనంతరం 27వసారి రక్తదానం చేసిన సంతోష్‌కుమార్‌, 17వసారి రక్తదానం చేసిన ఓ.సుమన్‌లకు ప్రశంసాపత్రాలు, మెమెంట్‌లను అందజేశారు. అలాగే రక్తదాన శిబిరం కూడా విజయవంతమైంది. ఉపాధ్యాయులు, పోలీసులతో పాటు రెడ్‌క్రాస్‌ సోసైటి ప్రతినిధులు రక్తదానం చేశారు.10 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో బ్లడ్‌బ్యాంకు ఇన్‌చార్జి డాక్టర్‌ రాఘవేంద్ర, రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొర్రా నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.గౌరిశంకర్‌, కోశాధికారి పి.సుర్యారావు, సభ్యులు జయలక్ష్మి, న్యాయవాది టి.ప్రసాద్‌నాయుడు, రవి, కో–ఆర్డినేటర్‌ సత్యనారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం 1
1/3

ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం

ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం 2
2/3

ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం

ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం 3
3/3

ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement