
టీఎంసీకి ఐసీఐసీఐ రూ.550 కోట్లు విరాళం
ఈ భారీ క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి ఐసీఐసీఐ బ్యాంక్ భారీ విరాళాన్ని టాటా మెమోరియల్ సెంటర్(టీఎంసీ)కు ప్రకటించింది. బ్యాంకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులు రూ.550 కోట్లతో ఈ అడ్వాన్స్డ్ క్యాన్సర్ కేర్ని నిర్మిస్తోంది. దేశంలో క్యాన్సర్ కేర్కు సంబంధించి విశాఖ, నవీ ముంబై, న్యూ చండీగఢ్లో కొత్తగా మూడు టీఎంసీ కేంద్రాల ఏర్పాటుకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.1,800 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో రూ.550 కోట్లతో విశాఖలో శిశు, రక్త క్యాన్సర్ చికిత్సకు తూర్పు దేశంలోనే అతిపెద్ద అత్యుత్తమ మెడికల్ టెక్నాలజీతో అధునాతన ఆస్పత్రి నిర్మాణానికి పూనుకున్నారు.