
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న హెచ్సీకి ఆర్థిక సాయం
అనకాపల్లి: అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి పోలీస్స్టేషన్లో హెచ్సీగా విధులు నిర్వహిస్తున్న ఓ.గణేశ్వరరావు అనారోగ్యం కారణంగా విశాఖ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శక్తి వెల్ఫేర్ అసోసియేషన్ 1990 బ్యాచ్ నుంచి అసోసియేషన్ అధ్యక్షుడు కె.అనిల్, ప్రధాన కార్యదర్శి ముబారక్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గణేశ్వరరావుకు శనివారం రూ.20వేలు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1990 బ్యాచ్కు చెందిన సహా ఉద్యోగులు ఏ రకమైన కష్టాల్లో ఉన్నా ఆదుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పూర్ణ, వెంకటేశ్వర్లు, రామారావు, మూర్తి, శ్రీను పాల్గొన్నారు.